వందేళ్లక్రితం బరారు శ్రీనివాసశర్మ రాసిన చారిత్రక నవల ‘ఆశాదోషము’  పరిశోధకుల కృషితో ఇప్పటికి వెలుగు చూసింది. నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక గ్రామంగా ఉన్న కోయలకొండ గోలకొండ సుల్తానుల పాలనలో కీలకమైన దుర్గం. ఆ ఊరి వాస్తవ్యులైన శ్రీనివాసశర్మ ఊళ్లో ఉన్న దుర్గాన్ని అణువణువూ పరిశోధించి, శిలాశాసనాలను చదివి చరిత్రను అర్థం చేసుకుని, సరళ గ్రాంథికంలో ఆసక్తికరమైన నవలగా మలిచారు. 70 కోటలు వశపర్చుకున్న కుతుబ్‌షా ఈ కోటను వశపర్చుకోడానికి 9 నెలలు కష్టపడాల్సి వచ్చిందట. స్వతంత్రరాజ్యంగా ఉన్న కోయలకొండను మోసంతో ఆక్రమించిన వైనాన్నీ; ఆనాటి పాలన, సాహిత్య, జీవన శైలుల గురించీ తెలుసుకోవాలనుకునేవారికి ఉపయోగపడే తెలంగాణ తొలి నవల ‘ఆశాదోషము’.


ఆశాదోషము (నవల) 
రచన: బరారు శ్రీనివాస శర్మ 
పేజీలు: 178; వెల: రూ.100/-; 
ప్రతులకు: ఫోన్‌- 9849084918
- శ్రీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి