నమస్తే తెలంగాణ 27-02-2018
ముప్పై ఏండ్ల తర్వాత గణప సముద్రం నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రచయితల సంఘం కమిటీ, జిల్లా కవులు, రచయితలు సందర్శించిండ్రు. రాష్ట్ర సాధన ఫలాలను కనులారా చూసి స్వీయ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్న తీరుకు ఆనందం, సంతృప్తి వ్యక్తం చేశారు

తెలంగాణ వస్తే ఏమొస్తదన్న దానికి నిదర్శనం కండ్ల ముందు కనిపిస్తున్నది. అందుకు వనపర్తి జిల్లా ఖిల్లా గణపురంలోని గణ పసముద్రం ప్రబల తార్కాణం. సప్త సముద్రాలలో గణపసముద్రం ఒకటి. ముప్పై ఏండ్లుగా బీడుపడిన గణప సముద్రం నిండి అలుగు పారుతున్నది. ప్రతి చెరువు అలుగు పారాలన్న తెలంగాణ ప్రభు త్వ ఆకాంక్ష గణప సముద్రంతో తీరినట్లయింది. రైతు బతుకుదెరువుకు చెరువులే జీవనాడులు. దశాబ్దాలుగా ఎండిన చెరువులు మిషన్ కాకతీయతో నిండుకుండలైనవి. భూములన్నీ పచ్చబడుతున్నవి. కాలువలు, కుంటలు పారుతున్నవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడేండ్లకు చెరువులు ఆనందతాండవం చేస్తున్నాయి. దీంతో వలసపోయిన ప్రజలంతా దమ ఊళ్లకు తిరిగి వస్తున్నరు. మూడేండ్లలోనే వేలాది ఎకరాలకు నీరందిస్తున్న చెరువులిపుడు సముద్రాలను తలపిస్తున్నవి.

సప్త సముద్రాలలో ఒకటైన గణపసముద్రాన్ని ఆనాడు కాకతీయ సామం త పాలకుడు గోనగన్నారెడ్డి గణపతిదేవుడి పేరుమీద ఈ చెరువును తవ్వించిండు. ప్రజలందరి జీవనానికి జీవనాడిగా ఉండే చెరువులను ఆనాడు ప్రతి ఊరులో ఒక చెరువును తవ్వించిండ్రు. అయితే వలసాంధ్ర పాల కుల నిర్లక్ష్యం, వివక్ష కారణంగా కరువుకు కేంద్ర బిందువైన పాలమూరు జిల్లాలో చెరువులన్నీ ఎండిపోయినవి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చెరువులన్నీ మురికి తుమ్మల పాలయినవి. 
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక చెరువులన్నీ ఇప్పుడు నీళ్ళతో కళకళలాడుతున్నవి. మిషన్ కాకతీయను ఒక ఉద్యమంలా చేపట్టడం వల్లనే చెరువులీనాడు నీళ్ళతో నవ్వుతున్నవి. ఊహకందని విధంగా సాగునీరు పారుతున్నది. వాగులు వంకలు నిండుతున్నవి. ఇంక రావనుకున్న నీళ్ళు కండ్లముందరే నిండుతుంటే సంబురమేస్తున్నది.

పాలమూరు జిల్లాకు వరప్రదాయిని అయిన కృష్ణాజలాలు గతంలో పాలమూరు దాటిపోయేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక మన నీళ్ళను మనమే ఒడిసిపట్టుకుంటున్నం. సమైక్యపాలనలో పోగొట్టుకున్నది మూడేండ్లలోనే తెచ్చుకున్నమంటే అది తెలంగాణ ప్రభుత్వ ఘనతే. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం 29 ప్యాకేజీ ద్వారా ఖిల్లాగణపురం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించి గణప సముద్రానికి సాగునీరందించడం ఊహకందని విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దీక్షా దక్షతలతో అసాధ్యమనుకున్నది సుసాధ్యం అయ్యింది. కెఎల్‌ఐ ఎత్తిపోతల పథకంలో మన వాటా 25 టీఎంసీలు ఉన్నదానిని 40 టీఎంసీలకు పెంచిన ఘనత ఈ ప్రాంత నేత నిరంజన్ రెడ్డిది. ఏడాదిగా ఖిల్లాగణపురానికి కెఎల్‌ఐ నుంచి సాగునీరు అందిస్తానని మాట ఇచ్చిన నిరంజన్‌రెడ్డి ఆ మేరకు తన మాట ను నిలబెట్టుకున్నడు. దీంతో గణపురంలోని ప్రజలే గాక చుట్టుముట్టూ గ్రామాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నరు. కేవలం గణపురం ప్రజలే కాదు తెలంగాణలోని ప్రతి ఊరు ఇపుడు చెరువులతో కళకళలాడుతున్నది. 

సమైక్యపాలనలో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి 3.67 లక్షల ఎకరాలకు నీరు తీసుకొచ్చేందుకు పాలనాపరమైన అనుమతి తీసుకున్నా దానికి సరైన కాల్వల డిజైన్ లేకపోడంతో పనులు చేపట్టలేదు. దాంతో ప్రాజెక్టులు ఆరంభ దశలోనే ఆగిపోయినవి. 
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టుల మీద పడ్డది. ప్రాజెక్టులు నీటితో కళకళలాడితేనే రైతన్నలు, ప్రజలు పచ్చగుంటరని తెలంగాణ ప్రభుత్వం నిండుమనస్సుతో ఉన్నది. ఆ మేరకు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలను సమన్వయం చేసి ప్రతి చెరువును నింపే ప్రయత్నం చేస్తున్నది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా వనపర్తి నియోజకవర్గమే కాకుండా నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు కూడా లబ్ధి చేకూరనున్నది. మన నీటిని మనకు కాకుండా సమైక్య పాలకులు చేసిన ద్రోహం ఇపుడు జనాలకర్థమవుతున్నది. ఇన్నాళ్ళుగా సాగునీటికోసం చేసిన భగీరథ ప్రయత్నం ఫలించింది. దశాబ్ధాలుగా నీటి ఆదరువులేని గుట్టల ప్రాంతానికి నేడు కృష్ణమ్మ గలగలా పరుగులు పెడుతుంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఫలాలే నని చెప్పక తప్పదు. 

ఎన్నేళ్ళో వేచిన ఉదయం అంటూ ఎదురుచూసిన క్షణాలు తెలంగాణ సాకారమై సాక్షాత్కారమైంది. తెలంగాణ అభివృద్ధికి ఎట్లా తిప్పలు పడుతున్నరో అర్థమవుతున్నది. పాలమూరు జిల్లాలో కరువు కాటకాలు, వలసలు ఎప్పుడు పోతాయోనంటూ ఎదురుచూసిన వాళ్ళకు నేడు నిండుతున్న చెరువులే జవాబు చెబుతున్నవి. నీళ్ళునిధులు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చెరువులు నిండుతుంటే ఉద్యమం లో విన్నది నేడు సాకారమైతుంటే తెలంగాణ ఎందుకో అర్థమవుతున్నది. ఇన్నాళ్ళు అరిగోసపడిన వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం స్వాంతన చేకూర్చుతున్నది. 

వచ్చే వానాకాలం నాటికి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తున్నది. సీమాంధ్ర పాలనలో రైతుల ఆత్మహత్యలు,ఆకలిచావులు, ప్రజల కన్నీళ్ళే ఎక్కడ చూసినా దర్శనమిచ్చేవి. ఒకవైపు పాలమూరు జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా, మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత పాల కులు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. దీంతో పసిడి పంటలు పండాల్సిన భూములు బీళ్ళుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీడు భూములన్నీ సాగులోకి వస్తున్నవి. గణప సముద్రం పూర్తిగా నిండంతో ఆ మండలమంతా సస్యశ్యామలమవుతున్నది. అరువై ఏండ్ల చరిత్రలో గణప సముద్రం అలుగు పారటం తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే కావడం విశేషం. అలాగే మండలంలోని మామిడిమాడలోని నేరెడు చెరువుతోపాటు ఖిల్లా గణపురం తాండ సమీపంలో ఉన్న ఎర్రకుంటను రిజర్వాయరుగా మార్చితే ఖిల్లాగణపురం మండలానికి శాశ్వతంగా నీరు అందుతుంది. 

ఆ ప్రయత్నంలోనే భాగంగా ఆయా మండలాల్లోని చెరువులను, కుంటలను నీటితో నింపి ఆయకట్టు భూములకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయటం హర్షణీయం. అంతేకాదు గణప సముద్రం నిండిన తర్వాత మండలంలోని మామిడిమాడ, సల్కెలాపూర్, కమాలొద్దీన్‌పూర్, వెంకటాంపల్లి చెరువులను నింపుతూనే పక్కనున్న మూసాపేట మండలంలోని నిజాలాపూర్, కందూర్ వరకు కృష్ణమ్మ నీటిని తరలించేందుకు కూడా అవకాశం ఉంది. ఈ గణప సముద్రం పూర్తిగా నిండడానికి 109 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు కూడా తీసుకున్నరు.

ముప్పై ఏండ్ల తర్వాత గణప సముద్రం నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రచయితల సంఘం కమి టీ, జిల్లా కవులు, రచయితలు సందర్శించిండ్రు. రాష్ట్ర సాధన ఫలాలను కనులారా చూసి స్వీయ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్న తీరుకు ఆనందం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధమై న పాలనతీరుతో రాష్ట్రం సస్యశ్యామల పైరు పచ్చల తెలంగాణగా మారు తుందనటంలో సందేహం లేదు. 
bheeempalli




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి