తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే పాలమూరు జిల్లా రూపురేఖలు మారినవి. కరువు జిల్లా పోయి పసిడి జిల్లాగా పాలమూరు చరిత్రకెక్కిపోతున్నది. భావితరాలను బంగారంలా పాలమూరు తయారవుతున్నది. ప్రాజెక్టుల రాకతో పాలమూరు పచ్చగా పండుతున్నది. బంగారు తెలంగాణే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నడు. కేసీఆర్ చేపట్టిన ప్రతీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నది. అలాంటివాటిలో రైతుబంధు పథకం అగ్రస్థానంలో నిలుస్తున్నది.


దేశానికి వెన్నెముక రైతన్న. దేశానికి అన్నం పెట్టేది రైతన్న. రైతు బాగుంటేనే దేశం బాగుండేది. ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, సరికొత్త పథకాలతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచి రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నది.సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా. రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి పోనంత వలసలు పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్ళేవారు. ఏటా 14 లక్షలు మంది వలసపోయే జిల్లాగా పాలమూరు ప్రఖ్యాతిగాంచింది. అనావృష్టితో పాలమూరు జిల్లాలో రైతు ల పరిస్థితి అధ్వానం. పంట పొలాలున్నా పండించలేని దుస్థితి. ఏ ప్రభు త్వం కూడా వ్యవసాయరంగాన్ని పట్టించుకోకుండా పాలన సాగించిందే తప్పా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వచ్చిన తర్వాతనే రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుదన్న మానవీయ ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాల వల్ల పాలమూరు జిల్లాలో వలసపోయిన కూలీలు వలస జిల్లాకు తిరిగి వస్తున్నారు.


తెలంగాణలో 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉన్నది. రైతన్న పంటలు పండించాలంటే సాగునీరు ప్రధానం. దీనికోసం ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్న యి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తయి రైతులకు సాగునీరును అందిస్తున్నది. ఏనాడు నిండని కాలువలు నేడు స్వరాష్ట్రంలో నిండుకుండలా పారుతున్నవి. రైతులకు సబ్సిడీ విత్తనాల నుంచి ఎరువుల వరకు వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతీది కష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కోటి ఎకరాల సాగు స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రాజెక్టు లు పరుగులు తీస్తున్నవి.


వ్యవసాయాన్ని పండుగలా చెయ్యడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. రాష్ట్రంలోని రైతులను సూక్ష్మ నీటిపారుదల సేద్యం వైపు మళ్ళించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతులకు 80 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని లాభాల బాటలో కొనసాగుతున్నరు.
ఇక నుంచి రైతన్న పంటకు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లవలసిన అవసరంలేదు. వ్యవసాయరంగంలో పెట్టుబడే ప్రధాన సమ స్య. ఈ పెట్టుబడి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దశాబ్దాలుగా అప్పుల్లో కూరుకుపోయి న రైతన్నకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అన్నదాతలు తల ఎత్తుకొని జీవించే లా రూపొందిన రైతులకు పథకం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. యాభై ఏండ్లలో కాంగ్రెస్ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.


ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తున్నది. ప్రతి ఊరి చెరువులను ఎత్తిపోతల పథకాలతో నింపుతున్నది. చెరువులు నిండితేనే రైతన్నలకు పండుగ. రైతన్న లు నవ్వితేనే ప్రజలకు నిత్యపండుగ. సాగునీటి వనరులు బుద్ధారం, ఖిల్లాగణపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌లతో వనపర్తి సస్యశ్యామలం కానున్నది.119 కోట్లతో ఖిల్లా ఘనపురం కెనాల్ 11 నెలల్లోనే పూర్తయి చరిత్ర సృష్టించింది. 30 ఏండ్ల తర్వాత గణప సముద్రం ఇక్కడ నీళ్లతో కళకళలాడుతున్నది. 25 కోట్లతో 24 కిలోమీటర్ల పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ముందుకు సాగుతున్నది.


2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేంతవరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వనపర్తి నియోజకవర్గానికి సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎం సీ ల కేటాయింపులే ఉండేది. దీని కి అదనంగా 15 టీఎంసీ లకు పెంచి ప్రస్తుతం 40 టీఎం సీల కు పెంచడం జరిగింది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం 29 ప్యాకేజీ ద్వారా ఖిల్లాగణపురం బ్రాంచి కెనాల్‌ను నిర్మించి గణప సముద్రానికి సాగునీరందించడం నిజంగా ఊహకందని విషయం. వచ్చే వానకాలం నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకుసా గుతున్నరు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే పాలమూరు జిల్లా రూపురేఖలు మారినవి. కరువు జిల్లా పోయి పసిడి జిల్లాగా పాలమూరు చరిత్రకెక్కిపోతున్నది. భావితరాలను బంగారంలా పాలమూరు తయారవుతున్నది. ప్రాజెక్టుల రాకతో పాలమూరు పచ్చగా పండుతున్నది. బంగారు తెలంగాణే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నడు. కేసీఆర్ చేపట్టిన ప్రతీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నది. అలాంటివాటిలో రైతుబంధు పథకం అగ్రస్థానంలో నిలుస్తున్నది.


దేశానికి వెన్నెముక రైతన్న. దేశానికి అన్నం పెట్టేది రైతన్న. రైతు బాగుంటేనే దేశం బాగుండేది. ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, సరికొత్త పథకాలతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచి రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నది.సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా. రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి పోనంత వలసలు పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్ళేవారు. ఏటా 14 లక్షలు మంది వలసపోయే జిల్లాగా పాలమూరు ప్రఖ్యాతిగాంచింది. అనావృష్టితో పాలమూరు జిల్లాలో రైతు ల పరిస్థితి అధ్వానం. పంట పొలాలున్నా పండించలేని దుస్థితి. ఏ ప్రభు త్వం కూడా వ్యవసాయరంగాన్ని పట్టించుకోకుండా పాలన సాగించిందే తప్పా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వచ్చిన తర్వాతనే రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుదన్న మానవీయ ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాల వల్ల పాలమూరు జిల్లాలో వలసపోయిన కూలీలు వలస జిల్లాకు తిరిగి వస్తున్నారు.


తెలంగాణలో 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉన్నది. రైతన్న పంటలు పండించాలంటే సాగునీరు ప్రధానం. దీనికోసం ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్న యి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తయి రైతులకు సాగునీరును అందిస్తున్నది. ఏనాడు నిండని కాలువలు నేడు స్వరాష్ట్రంలో నిండుకుండలా పారుతున్నవి. రైతులకు సబ్సిడీ విత్తనాల నుంచి ఎరువుల వరకు వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతీది కష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కోటి ఎకరాల సాగు స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రాజెక్టు లు పరుగులు తీస్తున్నవి.


వ్యవసాయాన్ని పండుగలా చెయ్యడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. రాష్ట్రంలోని రైతులను సూక్ష్మ నీటిపారుదల సేద్యం వైపు మళ్ళించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతులకు 80 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని లాభాల బాటలో కొనసాగుతున్నరు.
ఇక నుంచి రైతన్న పంటకు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లవలసిన అవసరంలేదు. వ్యవసాయరంగంలో పెట్టుబడే ప్రధాన సమ స్య. ఈ పెట్టుబడి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దశాబ్దాలుగా అప్పుల్లో కూరుకుపోయి న రైతన్నకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అన్నదాతలు తల ఎత్తుకొని జీవించే లా రూపొందిన రైతులకు పథకం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. యాభై ఏండ్లలో కాంగ్రెస్ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.


ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తున్నది. ప్రతి ఊరి చెరువులను ఎత్తిపోతల పథకాలతో నింపుతున్నది. చెరువులు నిండితేనే రైతన్నలకు పండుగ. రైతన్న లు నవ్వితేనే ప్రజలకు నిత్యపండుగ. సాగునీటి వనరులు బుద్ధారం, ఖిల్లాగణపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌లతో వనపర్తి సస్యశ్యామలం కానున్నది.119 కోట్లతో ఖిల్లా ఘనపురం కెనాల్ 11 నెలల్లోనే పూర్తయి చరిత్ర సృష్టించింది. 30 ఏండ్ల తర్వాత గణప సముద్రం ఇక్కడ నీళ్లతో కళకళలాడుతున్నది. 25 కోట్లతో 24 కిలోమీటర్ల పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ముందుకు సాగుతున్నది.


2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేంతవరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వనపర్తి నియోజకవర్గానికి సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎం సీ ల కేటాయింపులే ఉండేది. దీని కి అదనంగా 15 టీఎంసీ లకు పెంచి ప్రస్తుతం 40 టీఎం సీల కు పెంచడం జరిగింది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం 29 ప్యాకేజీ ద్వారా ఖిల్లాగణపురం బ్రాంచి కెనాల్‌ను నిర్మించి గణప సముద్రానికి సాగునీరందించడం నిజంగా ఊహకందని విషయం. వచ్చే వానకాలం నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకుసా గుతున్నరు.

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి