ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి రచించిన పాలమూరు మాండలికం (పాముల సంస్కృతం) పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించనునట్లు సాంస్కృతిక మండలి జిల్లా భ్యుసడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ తెలిపారు. ముఖ్య అతిధులుగా జేసీ ఎం.రాంకిషన్, డీఆర్ఓ భాస్కర్ పాల్గొంటారన్నారు. సభాధ్యక్షుడిగా డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి కవులు, కళాకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి