మహబూబ్‌నగర్‌ : నేడే ఆంగ్ల కవితాసంపుటి ఆవిష్కరణ
ప్రముఖ ఆంగ్లకవి, విశ్రాంత ఆర్‌ఐఓ రవిఠాకూర్‌ రచించిన ఆంగ్ల కవితా సంపుటిని ఆదివారం 10.30 గంటలకు పాలమూరు పట్టణంలో గల లిటిల్‌ స్కాలర్స్‌ హైస్కూల్‌లోని కాళోజి హాల్‌లో ఆవిష్కరించనున్నట్లు పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, ప్రముఖ కవికోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఆవిష్కరణ కర్తగా ప్రముఖ విద్యావేత్తగా, కవి జలజం, సత్యనారాయణ, సభాధ్యక్షులుగా ప్రముఖ సామాజికవేత్త ఆర్విణి రాజేంద్రబాబు, పుస్తక సమీక్షకులుగా పాలమూరు విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంగీపురం శ్రీనాథచారి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని కవి మిత్రులు, రచయితలు, సాహిత్యాభిమానులు తప్పక పాల్గొనాలని వారు కోరారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి