బ్రెయిలి లిపిలో శ్రీ పద్మకల్ప ప్రకాశిక, మార్కండేయ చరిత్ర ఆవిష్కరణ
బ్రెయిలి లిపిలో శ్రీ పద్మకల్ప ప్రకాశిక, మార్కం డేయ చరిత్రను ఆగస్టు 29న ఆవిష్కరించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహబూ బ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్ట ణంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో యాదేశ్వరి జయ శంకర్ బ్రెయిలి లిపిలో అనువ దించిన గ్రంథాలను ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ పానుగంటి బాలరాజు మాట్లాడుతూ బ్రెయిలి లిపిలో విశేష కృషి చేస్తున్న యాదేశ్వరి జయశంకర్‌ను ఈ సందర్భంగా కొనియాడారు.
జిల్లా అధ్యక్షుడు సాక బాల్‌నారాయణ మాట్లాడుతూ పద్మశాలి సమాజంలో అనేక మంది ప్రతిభావంతులైన వారున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. రాష్ర్టపతి అవార్డు గ్రహీత అయిన యాదేశ్వరి జయశంకర్ మన వంశ చరిత్రలను బ్రెయిలి లిపి లోకి అనువదించడం గర్వకారణమన్నారు. కలెక్టరేట్ సి సెక్షన్ ఇం చార్జ్ ఎం.ప్రభాకర్ రావు మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు మాట్లాడుతూ బ్రెయిలి లిపిలో కేవలం రామాయణ, భారతం, భాగవతాలను మాత్రమే కాకుండా రాష్ర్ట ప్రభుత్వ పాఠ్యపుస్తకాలైన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల అన్ని పాఠ్యపుస్తకాలను బ్రెయిలి లిపిలో అనువదించి ఉచి తంగా ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అప్పం అనంతరా ములు, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కోడి సుకుమార్, జగదీశ్, బిజ్జ శంకర్, బిజ్జ విశ్వనాథం, సూరప్రతాప్, పవన్‌కుమార్, భీంపల్లి నారా యణ, మత్కరాజేందర్, కొంగరి లక్ష్మినారాయణ, ఒగ్గు సత్యనారా యణ, కొంగరి సత్యనారాయణ, కొంతి గోపాల్ పాల్గొన్నారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి