మహబూబ్‌నగర్ సాంస్కృతిక విభాగం : తన సాహిత్య సేవల ద్వారా జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తున్న యువకవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌కు హైదరాబాద్ తెలుగు కవితా వైభవం సంస్థ వ్యవస్థాపకులు మేక రవీంద్రబాబు సహస్ర సాహిత్య సేవారత్న బిరుదును అందజేస్తున్నట్లు ఒక లేఖ ద్వారా భీంపల్లికి పంపారు. సాహిత్య, సాంస్కృతిక, విద్యారంగాలలో భీంపల్లి చేస్తున్న కృషిని గు ర్తించి ఈ బిరుదును ప్రదానం చేస్తున్నట్లు రవీంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఈ బిరుదును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. భీంపల్లికి సేవా రత్న బిరుదును ప్రకటించడంపట్ల జిల్లా కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు.

4/3/2017 1:22:53 AM నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 


ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌కు సహాస్ర సాహిత్య సేవారత్న బిరుదును ప్రదానం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ సారస్వత పరిషత్‌ సమావేశ మందిరంలో తెలుగు కవితా వైభవం ఆధ్వర్యంలో ఈ బిరుదును అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రచ యితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ కవి డాక్టర్‌ నందిని సిధారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డీ దేశపతి శ్రీని వాస్‌, తెలుగుకవితా వైభవం వ్యవస్థాపకులు మేక రవీంద్ర, సా హిత్య వేత్తలు దాస్యం సేనాధిపతి, శివకుమార్‌ పాల్గొన్నారు.



నవతెలంగాణ - మెట్టుగడ్డ Apr 10,2017



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి